Breaking News

ప్రజల సమస్యల పరిష్కారానికై గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమం – జిల్లా ఎస్పీ.

• మీ సమస్యలకు స్థానికంగా పరిష్కారం దొరకనప్పుడు, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సంప్రదించవచ్చు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
గ్రీవెన్స్ డే/ ప్రజావాణి కార్యక్రమంలో భాగం ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, పిర్యాది సమస్యలను ఓపికగా విని, సమస్య జాప్యానికి గల కారణాల గురించి సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఫోన్ ద్వారా మాట్లాడి.వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పరిష్కారం దొరకని సందర్భంలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, స్వచ్ఛందంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్ లో పొందుపరుస్తూ, కేసు యొక్క స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.., ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అన్నారు. ప్రజల సమస్యలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం “ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *