
దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం/ “పోలీస్ ఫ్లాగ్ డే” నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలను చేపడ్డం జరుగుతుందిని, ఇందులో భాగంగానే సంగారెడీ జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీ (Essay Writing Competition) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. కావున ఆసక్తి గల వారు ఈ ఆన్లైన్ వ్యాసరచన పోటీలలో పాల్గొనవలసిందిగా సూచించడం జరుగుతుంది. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో, 6వ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను రాసి, అక్టోబర్ 31 వ తేదీ లోగా ఆన్లైన్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1వ, 2వ, 3వ స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు ఇవ్వడంతో పాటు, రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలని ఎస్పీ సూచించారు.
వ్యాసరచన అంశం (Essay Topic): “Drugs Menace: Role of Police in Prevention and How Students Can Stay Away from Drugs” (డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు)
పోటీలో పాల్గొనే విధానం:
- ఈ లింక్ https://forms.gle/jaWLdt2yhNrMpe3eA ద్వారా పోలీసు ఫ్లాగ్ డే పోర్టల్ లో.
- మీ మెయిల్ ఐడి, పేరు, ఫోన్ నెంబర్, విద్యార్హత తదితర వివరాలు నమోదు చేయండి.
- వ్యాసాన్ని పేపర్పై రాసి, ఫోటో జేపీజీ/ పిడిఎఫ్ ఫార్మాట్లో 500 పదాలు మించకూడ రాసి, అప్లోడ్ చేసి, సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
