
సోషల్ మీడియా మరియు మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫారంలను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. వివాహ వాగ్దానం చేస్తూ నమ్మకం పొందిన తరువాత, నకిలీ ఆన్లైన్ పెట్టుబడి పథకాలలో డబ్బులు పెట్టమని బాధితులను ప్రలోభపెడుతున్నారు. కొత్త తరహా సైబర్ మోసాలపై జిల్లా ప్రజలకు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
హెచ్చరిక : ఇటీవలే తెలంగాణలో ఒక బాధితుడు ఇలాంటి మోసంలో ₹7.7 కోట్లు నష్టపోయాడు.
మోసగాళ్ల పద్ధతి: ఆకర్షణీయమైన ప్రొఫైళ్ళను మ్యాట్రిమోనియల్ సైట్లు సోషల్ మీడియాలో NRIs, వ్యాపారులు లేదా విదేశాలలో ఉన్న ప్రొఫెషనల్స్ సృష్టిస్తారు. తరచూ సంప్రదిస్తూ, భావోద్వేగపూర్వకంగా నమ్మకం సంపాదించి, వివాహ వాగ్దానం చేస్తారు. నమ్మకం పొందిన తర్వాత క్రిప్టో, ఫారెక్స్, స్టాక్స్, స్టార్ట్-అప్స్ ఎగుమతి వ్యాపారం వంటి లాభదాయక పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు. నకిలీ యాప్ లు లేదా వెబ్సైట్లు చూపించి మొదట చిన్న మొత్తంలో లాభాలు చూపిస్తారు. పెద్ద మొత్తాలు పెట్టిన తర్వాత యాప్/వెబ్సైట్ మూసివేయబడుతుంది లేదా మోసగాడు అదృశ్యమవుతాడు.
ప్రజలకు సూచనలు: నిర్ధారించని సోషల్ మీడియా లేదా మ్యాట్రిమోనియల్ ప్రొఫైళ్ళ ద్వారా వచ్చిన వివాహ ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించండి. వ్యక్తిగత గుర్తింపు కుటుంబ నేపథ్యం మొదలైన వివరాలను స్వతంత్రంగా ధృవీకరించుకోండి. భావోద్వేగాల పేరుతో లేదా వివాహ వాగ్దానాలపై ఆధారపడి ఎప్పటికీ పెట్టుబడులు పెట్టవద్దు. ఏ పెట్టుబడి ప్లాట్ఫారమ్లు అయినా ఆర్థిక సంస్థలు లేదా అధికారిక వనరులతో ధృవీకరించండి. వ్యక్తిగత, బ్యాంక్, ఆర్థిక వివరాలు ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో పరిచయాలు పంచుకోవద్దు.
గుర్తుంచుకోండి నిజమైన భాగస్వాములు ఆర్థిక సహాయం లేదా నిర్ధారించని పెట్టుబడులు పెట్టమని అడగరు. అనుమానాస్పదమైన ఏదైనా కార్యకలాపం లేదా మోసం జరిగినట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. “వివాహం నమ్మకంపై నిలుస్తుంది. డబ్బుపై కాదు. భావోద్వేగ దోపిడీ ఈ మోసానికి మొదటి అడుగు. అప్రమత్తంగా ఉండండి. గుడ్డిగా పెట్టుబడులు పెట్టవద్దు.”
