
శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని, మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా పోలీసు ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాల మేరకు ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, డి.సి.ఆర్.బి డిఎస్పీ గండ్రతి మోహన్, కేసముద్రం సీఐ సత్యనారాయణ, సీఐ శంకర్ నాయక్ ఆర్.ఐలు భాస్కర్, సోములు, నాగేశ్వర్రావు,అధికారులు పాల్గొని, మహర్షి వాల్మీకి గారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక నివాళులర్పించారు.
