
•సమస్యకు సత్వర న్యాయం జరగనప్పుడు మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని రావచ్చు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ. వారి సమస్యలను ఓపికగా విని, సమస్య స్థితి, జాప్యానికి గల కారణాల గురించి సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఫోన్ ద్వారా మాట్లాడి. వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, చట్టప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ. లకు సూచనలు చేయడం జరిగింది. జిల్లా ప్రజలు తమ సమస్యకు స్థానికంగా పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ ముందు ఉంటుందని, జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలసిందిగా జిల్లా ఎస్పీ సూచించడం జరిగింది.