
సిరిసిల్ల పట్టణంలో నేడు జరిగే నిమజ్జన కార్యక్రమాలకు 400 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. నిమజ్జనం విజయవంతంగా పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిసిచాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా పికెట్స్ ,పుష్షింగ్ పార్టీ లు ఏర్పాటు. నిర్ణిత సమయానికి నిమర్జనం పూర్తి చేసి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలి. నిమార్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నాం.
