Breaking News

చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ మనీ మోసాలకు పాల్పడుతున్న నాలుగురు వ్యక్తులు అరెస్ట్.

పాలాజీ శ్రీనివాస్ s/o కాంతయ్య, 2.గొడిసెల సంతోష్ s/o యాదగిరి, 3.ఉప్పు రమేష్ s/o లచ్చన్న, 4.కందు నరేష్ s/o శంకర్, అనే నలుగురు వ్యక్తులు హైదరాబాద్ లోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ మనీని తీసుకొని వచ్చి వర్జినల్ నోట్ల మధ్య మధ్య లో పెట్టి షాపింగ్ చేసిన సమయాల్లో బిల్ కడుతు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో సిరిసిల్లకు రాగా గాంధీ చౌక్ వద్ద తిరుగుతుండగా నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్ల పట్టణ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి టాయ్ మని 14కట్టలు గల 500 టాయ్ నోట్స్, ఒక కార్ ,05మొబైల్ ఫోన్స్ ,21,000/- రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *