Breaking News

మహిళలు,బాలికల భద్రతకు అంకితమైన షీటీమ్స్-జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్.

జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల రక్షణ కోసం షీటీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. రద్దీ ప్రదేశాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూల్ లలో సివిల్ డ్రస్ లో నిఘా నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరికైనా వేధింపులు జరిగిన వెంటనే జిల్లా షీటీమ్ నెంబర్ 8712659365 లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ శ్రీమతి జానకి, ఐపీఎస్, తెలిపారు. ఆగస్టు నెలలో మాత్రమే జిల్లాలో మొత్తం 25 పిర్యాదులు అందగా, అందులో 13 మందికి కౌన్సెలింగ్, 11 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం, 3 ఇవిటీజింగ్ కేసులు నమోదు చేయడం, అలాగే 25 అవగాహన కార్యక్రమాలు, 70 హాట్‌స్పాట్ విజిట్స్ నిర్వహించడం జరిగింది. పోకిరీలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయడం కూడా షీ టీమ్స్ ద్వారా జరుగుతోంది. విద్యార్థినీ విద్యార్థులకు ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, బాల్య వివాహాల పరిణామాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సోషల్ మీడియా వాడకం వల్ల కలిగే నష్టాలు, సైబర్ క్రైమ్స్, డయల్-100 ప్రాముఖ్యత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటి అంశాలపై షీటీమ్ సిబ్బంది ప్రతిరోజూ అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదురైనా తక్షణమే షీటీమ్ లేదా డయల్-100ను సంప్రదించి సహాయం పొందాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *