Breaking News

వినాయక మండపాలను సందర్శించి పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips.

జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాల బాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణం ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం వరకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. జిల్లాలో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ,పెట్రో కార్, బ్లూ క్లోట్స్ సిబ్బంది, 24*7 పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు విద్యుదీకరణ జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ప్రతి మండపాల వద్ద నిర్వాహకులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామనీ పలు జాగ్రత్తలపై నిర్వహులకు సూచించారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. నిమజ్జనం వరకు పోలీస్ వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, యస్బి సిఐ రాము,నల్లగొండ 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, తదితరులున్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *