
వినాయక నిమర్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.వినాయక శోభా యాత్ర, నిమర్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేయాలని, నిమర్జనాలు చేసే చెరువుల వద్ద గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ విజిటింగ్ లో ఎస్పీ వెంబడి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్బి ఇన్స్పెక్షర్ కిరణ్, తదితరులు ఉన్నారు.
