Breaking News

హైదరాబాద్ అధ్యక్షతన సౌత్ జోన్ పోలీసు అధికారులతో ఈ సమీక్షా సమావేశం-సీవీ ఆనంద్.

పురానీ హవేలీ కార్యాలయంలో సీవీ ఆనంద్ ఐపీఎస్, డీజీ మరియు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాద్ అధ్యక్షతన సౌత్ జోన్ పోలీసు అధికారులతో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు మరియు పోలీసు బందోబస్తుపై చర్చించారు.
సీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ మాట్లాడుతూ, గతంలో నిమజ్జనం సమయంలో జరిగిన లోటుపాట్ల గురించి చర్చించారు. మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా ఉన్నందున శాంతిభద్రతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం కోసం త్వరగా తరలించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించి, అందరు అధికారులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీమతి స్నేహా మెహ్రా ఐపీఎస్ (డీసీపీ, సౌత్ జోన్), శ్రీమతి కె. అపూర్వ రావు ఐపీఎస్ (డీసీపీ, ఎస్.బి), ఆర్. వెంకటేశ్వర్లు ఐపీఎస్ (డీసీపీ, ట్రాఫిక్ ), టాస్క్ ఫోర్స్ అధికారులు, మరియు సౌత్ జోన్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *