
• సుమారు 150 మంది బంగారం దుకాణదారులతో భద్రత సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.
• సిసి కెమెరాలను, వాల్ సెన్సార్ లను ఏర్పాటు చేసి, భద్రతను బలోపేతం చేయాలి.
• లైసెన్స్డ్ ఆయుధాలు కలిగిన సెక్యూరిటీ ని నియమించుకోవాలి.
• అపరిచిత, అనుమానిత వ్యక్తుల నుండి బంగారం కొనుగోలు చేయరాదు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారం దుకాణాల భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సుమారు 150 మంది బంగారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని బంగారం దుకాణాలలో సీసీ కెమెరాలు, వాల్ సెన్సార్లు, అలారమ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, లైసెన్స్డ్ ఆయుధాలు కలిగిన సెక్యూరిటీని నియమించుకోవాలి సూచించారు. అపరిచిత లేదా అనుమానిత వ్యక్తుల నుండి బంగారం కొనుగోలు చేయరాదని, దొంగసొత్తుకు సంబంధించిన ఆనవాళ్లను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దుకాణ భద్రత, ఆర్థిక లావాదేవీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, జిల్లా పోలీసు అధికారుల ఫోన్ నెంబర్స్ కలిగి ఉండాలని, అత్యవసర సమయంలో డైల్ -100 చేయాలన్నారు. జిల్లాలో నేరాలను అరికట్టడంలో పోలీసులకు సహకరించాలని, భద్రతా చర్యలు ప్రతి ఒక్కరూ అమలు చేయాలని జిల్లా ఎస్పీ దుకాణదారులను కోరారు. ఈ మీటింగ్ నందు సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డిఎస్పీ ప్రభాకర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, వివిధ గోల్డ్ షాప్ లకు చెందిన సుమారు 150 మంది యజమానులు, గోల్డ్ స్మిత్ లు తదితరులు
