Breaking News

గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సు-ఎస్‌ఐ శైలజ.

ధరూర్ సీఐ రఘురాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణేష్ మండపాలకు తప్పనిసరిగా పోలీస్ మరియు సంబంధిత శాఖ అనుమతులు అవసరం. మండపాల వివరాలు గణేష్ మండపాల పోర్టల్‌లో నమోదు చేయాలి. రోడ్లను బ్లాక్ చేయకూడదు, భారీ సౌండ్ సిస్టమ్స్, డీజే లకు అనుమతి లేదు.
విగ్రహ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఆర్గనైజర్లు రాత్రివేళల్లో మండపాల వద్ద ఉండాలి. మండపాల దగ్గర ఇసుక, నీటి బకెట్లు (ఫైర్ ప్రికాషన్స్) ఉంచాలి. నిమజ్జన మార్గాలను ముందుగా పోలీసులకు తెలియజేయాలి. గణేష్ లడ్డు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ సూచనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ రఘురాములు అన్నారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *