Breaking News

అంతరాష్ట్ర ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్ – జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్.

ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలం వులుపల్లి గ్రామానికి చెందిన అంబటి రాంబాబు అనే వ్యక్తి తెలుగు రాష్ట్రల్లో ఆన్లైన్ గేమ్స్/స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టి పెద్దమొత్తంలో డబ్బులు పోగొట్టుకోగా ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని కాకినాడ లో 2019 సంవత్సరంలో ఒక ఇంటిలో దొంగతనికి పాల్పడగా అడ్డుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులను హత్య చేయగా అట్టి హత్య కేసులో రిమాండ్ కాకా,అనంతరం హైదరాబాద్ పట్టనికి మకాం మార్చి ద్విచక్ర వాహనాలకు పాల్పడగా గుంటూరు జిల్లా కి చెందిన మండ్రు నారాయణ అనే వ్యక్తి యూనిమని లో చేస్తున్న ఉద్యోగ నిమిత్తం 01-06-2025 రోజున సిరిసిల్లకి వచ్చి వెళ్లే దారిలో వెంట్రవుపల్లి గ్రామంలో టిఫిన్ చేయడానికి అగగా టిఫిన్ సెంటర్ ముందు వాహనం నిలిపి వెళ్లి టిఫిన్ చేసి వచ్చే సరికి వాహన లేనందున బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నారాయణ పిర్యాదు చేయగా బోయినపల్లి ఎస్.ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్,టాస్క్ఫోర్స్ సిబ్బంది,బోయినపల్లి పోలీస్ సిబ్బందితో టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయగా సాంకేతికత ఆధారంగా హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని విచారించగా నాలుగు సంవత్సరాలు 22 ద్విచక్ర వాహనాలు దొంగలించనని,నాపై హత్య కేసు,చీటింగ్ కేసులు ఉన్నాయని ఒప్పుకోగా జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు 08 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. మిగతా వాహనాలు కూడా త్వరలో రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ వెంట టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్,ఎస్.ఐ లు రమాకాంత్, శ్రీకాంత్,సిబ్బంది తిరుపతి, రాజేష్, శ్రీనివాస్, ఉమపతి, శ్రీనివాస్,మహిపాల్,శివ ఉన్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *