
వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ చేసిన విశిష్ట సేవలకు గాను భారత నౌకాదళం నుండి ప్రశంసా పత్రం లభించింది. భారత నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి స్వయంగా ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, నిబద్ధత, వృత్తి నైపుణ్యంకి గుర్తింపుగా లభించిందని పేర్కొన్నారు. గుర్తింపు పొందినందుకు కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తనకే కాకుండా వికారాబాద్ జిల్లా పోలీసు శాఖకే లభించిన గుర్తింపు అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
