
సిరిసిల్ల పట్టణ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలు గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోనుటకు తీసుకోవలసిన జాగ్రతల గురించి పోలీస్ శాఖ తరపున మీటింగ్ నిర్వహించబడును, ఇట్టి మీటింగ్ కు మండపాల నిర్వాహకులు, కమిటీ ఉత్సవ సభ్యులు తప్పనిసరిగా హాజరు అయి గణేష్ నవరాత్రులను శాంతియుతంగా జరుపుకోనుటకు పోలీస్ శాఖ తరపున సూచనలు మరియు సలహాలు తెలుసుకోగలరని సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ k కృష్ణ తెలిపినారు. ఇట్టి మీటింగ్ కి ముఖ్య అతిదులు: జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే IPS రాజన్న సిరిసిల్ల, చంద్ర శేఖర్ రెడ్డి, SDPO సిరిసిల్ల,K కృష్ణ, ఇన్స్పెక్టర్ ఆప్ పోలీస్ సిరిసిల్ల హాజరు అవుతారు. కావున సిరిసిల్ల పట్టణ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీస్ శాఖ వారి వారి సూచనలు మరియు సలహాలు తెలుసుకొని పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
