Breaking News

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి – ఎస్ఐ శైలజ.

వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్ఐ శైలజ తెలిపారు. అనుమతులు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో గణేష్ మండపాలకు గ్రామ పెద్దలు,యువకులు పోలీసుల అనుమతి తప్పనిసరి. మండపాల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కనీసం టూ వీలర్ వెళ్లేలా దారి ఇవ్వాలి. రద్దీగా ఉన్న మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. విద్యుత్ కనెక్షన్లకు ఎలక్ట్రిసిటీ అధికారుల అనుమతి తప్పనిసరి. మండపాల వద్ద అగ్నిప్రమాదాల నివారణ చర్యలు తప్పనిసరి. అనుమానాస్పద బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ లేదా 112కి వెంటనే సమాచారం ఇవ్వాలి. డీజేలకు అనుమతి లేదు. భారీ వర్షాలు కురిసే అవకాశం దృష్టిలో ఉంచుకొని మండపాలు సురక్షితంగా ఏర్పాటు చేయాలి. మండపాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *