
సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం కాలనీ ఓం ఝండా సమీపంలో ఉన్న డ్రీమ్ పఫ్ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. వారు ఉపయోగించే కేక్స్, బ్రేడ్స్ లలో కాలం చెల్లిన వాటిని ఉపయోగిస్తున్నారు. ఎస్ఓటి పోలీసులు వారి దగ్గర నుండి వివిధ కాలం చెల్లిన వస్తువులు వనిల్లా పౌడర్ 04 యూనిట్లు,మిల్క్ ఫ్లేవర్ 02 యూనిట్లు, ఫ్లేవరింగ్ ఏజెంట్ 01 బాటిల్, సింథటిక్ కలర్,కేకులు 39.5 కిలోల.బన్స్ స్వాధీనం చేసుకున్నారు. తయారీ ప్రక్రియ మరియు ప్రాంగణం అపరిశుభ్రంగా మరియు ఆహార ఉత్పత్తికి సురక్షితం కాదు అని వారన్నారు. అదేవిధంగా కాలం చెల్లిన పదార్థాలను కేక్స్, బ్రెడ్స్ ఇతర బేకరీ ఐటమ్స్ లలో వాడుతున్నారని,ఫుడ్ లైసెన్స్ లేకపోవడం కార్మిక లైసెన్స్ లేకపోవడం పూర్తిగా బేకరీ చట్టవిరుద్ధంగా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తోంది అని మేడ్చల్ ఎస్ఓటి సీఐ తెలిపారు. బేకరీలు నయా దందా మొదలుపెట్టారు. కాలం చెల్లిన వస్తువులతో బేకరీ ఐటమ్స్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బేకరీ పైన ఎస్ఓటి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో మేడ్చల్ ఎస్ఓటి టీం పాల్గొన్నారు.
