
250 గ్రాముల గంజాయి,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం. అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవు. వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్.
సుల్తానాబాద్ కి చెందిన వేముల శ్రీనివాస్,వేముల విజయ లక్ష్మీ అనే భార్యాభర్తలు మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి గంజాయి కొనుగోలు చేసి గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్ముతూ వాటితో జల్సాలు చేస్తుండేవారు. సిరిసిల్ల జిల్లాలో గ్రానైట్ కార్మికులకు ఎక్కువ రేటుకు గంజాయి అమ్ముతున్నారని అందులో భాగంగా బోయినపల్లి మండలం కోరేం గ్రామశివారుకి వస్తున్నారన్న సమాచారం మేరకు బోయినపల్లి ఎస్.ఐ తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా అనుమానాస్పధముగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారివద్ద 250 గ్రాముల గంజాయి ,రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందిని తెలిపారు.
అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు. యువత డ్రగ్స్ భారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
