
నిందితుల వద్ద నుండి సుమారు 40 వేల రూపాయల గల కిలోన్నర గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధీనము
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో బాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తన్ అనే కార్యక్రమం ద్వారా మాదకద్రవాలకు అలవాటు పడిన అనేక మందిని కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావడం జరిగింది. A-1) పెరిక కరణ్ జయరాజ్ నల్లగొండ పట్టణము నంధు గత కొద్ది సంవత్సరములుగా రియల్ ఎస్టేట్ వ్యాపారము చేస్తున్నాడు. వ్యాపారములో బాగంగా A-2. యెల్లెంల శివ శంకర్ మరియు A-3. పెద్దమాము వీరస్వామి తో పరిచయము ఏర్పడి స్నేహంగా ఏర్పడినధి. వీరు గత రెండు సంవత్సరములుగా గంజాయి త్రాగుడుకు అలవాటు పడి హైదరాబాద్ లోని ధూల్ పేట లో గంజాయి కొనుక్కొని వచ్చి త్రాగుచుండేవారు. వీరు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గత ఆరు నెలలుగా A-1) పెరిక కరణ్ జయరాజ్ డబ్బులు పెట్టుబడి పెట్టి A-2. యెల్లెంల శివ శంకర్ ను హైదరాబాద్ కు పంపగా అతడు ధూల్ పేట లోని గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయి రూపాయలు 10,000/- లు కిలో చొప్పున కొనుగోలు చేసి రాగా వీరు ముగ్గురు కలిసి అట్టి గంజాయిని చిన్న పాకెట్లు గా తయారీ చేసి నల్ల గొండ లో గంజాయి తాగే వ్యక్తులకు ఒక్క పాకెట్ 500/- రూపాయల చొప్పున అమ్మేవారు. వీరి వలన నల్లగొండ పట్టణంలో యువత పెడదారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉదయము వీరు ముగ్గురు కలిసి అట్టి గంజాయిని చిన్న పాకెట్లుగా తయారు చేస్తుండగా పోలీసు వారికి వచ్చిన నమ్మధగిన సమాచారము మేరకు వెళ్ళి వారి అరెస్టు చేసి వారి వద్ధ నుండి కిలోలోన్నర గంజాయి మరియు (03) సెల్ ఫోన్లు స్వాధీనము చేసుకోనీ నిందితులను నేడు రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇట్టి కేసును నల్గొండ DSP, K. శివరాం రెడ్డి పర్యవేక్షణలో Nalgonda II town సర్కిల్ ఇన్స్పెక్టర్ S.రాఘవ రావు ఆద్వర్యంలో ఇట్టి నేరస్థులను పట్టుబడి చేసిన నల్గొండ II టౌన్ యస్.ఐ వై.సైదులు మరియు వారి సిబ్బంది పాయిలి రాజు, బాలకోటి లను జిల్లా S.P అభినందించనైనది.
