Breaking News

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పారదర్శకంగా ముగిసిన వాహనాల,వస్తువుల వేలం:జిల్లా ఎస్పీ.

శనివారం రోజున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలో పలు సందర్భాల్లో స్వాధీన పరుచుకున్న/రోడ్ల మీద వదిలేసిన వాహనాలు మొత్తం 54 వాహనాలు వేలంపాట నిర్వహించగా,ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు మొత్తం 5,36,000/- రూపాయలు మరియు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో సర్వీస్ లో లేని కిట్ ఆర్టికల్స్, పాతబడిన టెంట్లు, ఇనుప సామాగ్రి,జెనరేటర్, స్టోర్ మొదలగు వసువులను వేలంపాట నిర్వహించగా,ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు మొత్తం 1,54,100/- రూపాయల మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు….60 కి పైగా కొనుగోలుదారులు ఈ వేలం పాటలో పాల్గొన్నారు.

ఈ వేలం పాటలో అదనపు ఎస్పీ చంద్రయ్య ,స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ,ఆర్.ఐ లు మధుకర్, రమేష్ ,ఆర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *