బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Telangana

నర్సింహుళపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

నర్సింహుళపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ క్రైమ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఈ రోజు నర్సింహుళపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా స్టేషన్ ఆవరణ, సిబ్బంది బస చేసే ప్రాంతాలు, స్టేషన్ గదులు పరిశీలించి, పరిశుభ్రతపై ఆరా తీశారు.

ఆ తర్వాత స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ, ప్రస్తుతమున్న కేసుల విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి దర్యాప్తు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని, ప్రతి కేసును నిష్పక్షపాతంగా, నాణ్యతతో దర్యాప్తు చేయాలని SHO కు సూచనలు ఇచ్చారు.

సైబర్ నేరాలు – అవగాహన అవసరం

జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఈ నేరాలకు గురవుతున్నారని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్స్, ఫేక్ లింక్స్, మోసపూరిత యాప్స్ ద్వారా యువత నష్టపోతున్నారని, అందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

నాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని హెచ్చరించారు.

సిబ్బందికి మార్గదర్శకాలు

స్టేషన్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలకు 24/7 అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని చెప్పారు. స్వయంగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తొర్రుర్ డీఎస్పీ కృష్ణ కిషోర్, తొర్రుర్ సీఐ గణేష్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సైబర్ క్రైమ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సురేష్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.