బ్రేకింగ్ న్యూస్
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణహత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణ
Telangana

ఎస్‌హెచ్‌ఓలకు ‘స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం: వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా

ఎస్‌హెచ్‌ఓలకు ‘స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం: వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లా పోలీసు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా “స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్”పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరచడం, రికార్డులను క్రమబద్ధీకరించడం, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పోలీసింగ్ సేవలు అందించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లలో పారదర్శకతను పెంపొందించేందుకు నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు, స్టేషన్‌కు సంబంధించిన దాదాపు 50 రకాల ముఖ్యమైన రికార్డులు, డిజిటల్ డేటాను క్రమపద్ధతిలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. స్టేషన్లలో పని సామర్థ్యం, సేవల నాణ్యత పెంపు కోసం ‘5ఎస్’ (Sorting, Systematization, Shining, Standardization, Self-Discipline) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.

సాంకేతికత వినియోగంపై దృష్టి సారిస్తూ, మొబైల్ ఫ్రెండ్లీగా మారిన ‘సీసీటీఎన్‌ఎస్ 2.0’ (CCTNS 2.0)లో వంద శాతం రియల్‌టైమ్ డేటా నమోదు చేయాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం విలేజ్ విజిట్స్, విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.

శిక్షణలో భాగంగా ప్రజా రక్షణ, నిఘా వ్యవస్థను బలోపేతం చేసే ‘సురక్ష మిత్ర’, ‘రక్షణ నేత్రం’ కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలు, కాలనీల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ భద్రతా పర్యవేక్షణ నిర్వహించడమే ‘సురక్ష మిత్ర’ లక్ష్యమని తెలిపారు.

ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

అలాగే, సాంకేతిక నిఘాను బలోపేతం చేసి నేరాలను అరికట్టేందుకు ‘రక్షణ నేత్రం’ కార్యక్రమం కింద ప్రతి వీధి, గ్రామం, పట్టణంలోని కూడళ్లలో సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేసి, వాటిని పోలీసు నిఘా పరిధిలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

సమర్థవంతమైన నాయకత్వం, పౌర స్నేహపూర్వక పోలీసింగ్‌కు ఒక చక్కని పోలీస్ స్టేషన్ అద్దం పడుతుందని పేర్కొంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ ఎస్. శ్రీనివాసులు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూర్ డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.