Breaking News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

సమర్థవంతమైన దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

Mahabubnagar Special Sessions Court కీలక తీర్పు వెలువరించింది. 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కుర్రావత్ రమేష్ (25)పై నేరం రుజువుకావడంతో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 నవంబర్ 22న జరిగిన ఘటనలో బాధిత మైనర్ బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేయగా, జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

కేసు విచారణ సందర్భంగా పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. జాన్ 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి బలమైన వాదనలు వినిపించారు. మిడ్జిల్ ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో సీడీఓలు రమేష్, శంకర్ మరియు కోర్టు లైజనింగ్ ఏఎస్ఐ బాలకృష్ణ సాక్షులను క్రమపద్ధతిలో కోర్టులో ప్రవేశపెట్టి విచారణ వేగంగా పూర్తయ్యేలా కృషి చేశారు.

బక్రీద్ నేపథ్యంలో అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా

విచారణ అనంతరం మహబూబ్‌నగర్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, ప్రజా అభియోజకులను జిల్లా ఎస్పీ D. Janaki అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *