Breaking News

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.. నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, విధి నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించిన ఎస్పీ, పోలీస్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకున్న ఎస్పీ, విధి సమయాల్లో ప్రతి పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా స్టేషన్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ సులభంగా చేరుకునే విధంగా సేవలు అందించాలని సూచించారు.

పెండింగ్ కేసులపై వేగవంతమైన చర్యలు తీసుకుని, నాణ్యతతో విచారణ పూర్తి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, తక్షణ స్పందన ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

గ్రామాల్లో నేర నివారణ చర్యలను బలోపేతం చేయడానికి బీట్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సీసీటీవీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు.

పాన్ షాపుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు.. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య హెచ్చరిక

పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచడంతో పాటు మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు.

ఈ తనిఖీ సందర్భంగా ఎస్సై బి. వెంకన్నతో పాటు స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *