బ్రేకింగ్ న్యూస్
నల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానానల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే“సురక్షా కా తిరంగా”తో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన.. అప్రమత్తతే రక్షణ: నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా
Uncategorized

జిల్లా పోలీసు విశ్రాంతి ఉద్యోగుల సేవా స్పూర్తి – చలివేంద్రం ప్రారంభించిన – జిల్లా ఎస్పీ.

మహబూబ్నగర్ జిల్లా పోలీసు విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ప్రారంభించారు. “సర్వీస్‌లో ఉన్నవారికంటే సర్వీస్ నుంచి రిటైర్ అయిన వారికి సేవలు చేయడం ఎంతో ముఖ్యమైంది. మీరు గతంలో చేసిన కృషి, సేవల వల్లే ప్రస్తుతం మేము సౌకర్యంగా విధులు నిర్వహించగలుగుతున్నాము. మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఫోన్ ద్వారా కానీ, కార్యాలయానికి వచ్చి కానీ 24 గంటల పాటు మీకు అందుబాటులో ఉంటాను” అని హామీ ఇచ్చారు.
అలాగే విశ్రాంతి ఉద్యోగులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఎస్పీ కొనియాడారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు అందించడం ద్వారా వారు చూపుతున్న సేవా భావం ప్రశంసనీయమని తెలిపారు.“ఇలాంటి కార్యక్రమాలు పోలీస్ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. యువతరం పోలీసులకు కూడా ఇవి ప్రేరణగా నిలుస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ, “పోలీసు శాఖలో పనిచేసిన అనుభవంతో సమాజానికి తిరిగి సేవ చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము” అని తెలిపారు. “విశ్రాంతి తర్వాత కూడా మా సేవా ప్రయాణం ఆగదు. ప్రజలకు అవసరమైనప్పుడు సహాయం అందించడం మా ధ్యేయం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజి రెడ్డి, కార్య నిర్వహణ అధ్యక్షులు పటేల్ సత్తయ్య విశ్రాంతి పోలీసు ఉద్యోగులు మరియు ప్రస్తుత పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి