Breaking News

జిల్లా పోలీసు విశ్రాంతి ఉద్యోగుల సేవా స్పూర్తి – చలివేంద్రం ప్రారంభించిన – జిల్లా ఎస్పీ.

మహబూబ్నగర్ జిల్లా పోలీసు విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ప్రారంభించారు. “సర్వీస్‌లో ఉన్నవారికంటే సర్వీస్ నుంచి రిటైర్ అయిన వారికి సేవలు చేయడం ఎంతో ముఖ్యమైంది. మీరు గతంలో చేసిన కృషి, సేవల వల్లే ప్రస్తుతం మేము సౌకర్యంగా విధులు నిర్వహించగలుగుతున్నాము. మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. ఫోన్ ద్వారా కానీ, కార్యాలయానికి వచ్చి కానీ 24 గంటల పాటు మీకు అందుబాటులో ఉంటాను” అని హామీ ఇచ్చారు.
అలాగే విశ్రాంతి ఉద్యోగులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఎస్పీ కొనియాడారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు అందించడం ద్వారా వారు చూపుతున్న సేవా భావం ప్రశంసనీయమని తెలిపారు.“ఇలాంటి కార్యక్రమాలు పోలీస్ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. యువతరం పోలీసులకు కూడా ఇవి ప్రేరణగా నిలుస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ, “పోలీసు శాఖలో పనిచేసిన అనుభవంతో సమాజానికి తిరిగి సేవ చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము” అని తెలిపారు. “విశ్రాంతి తర్వాత కూడా మా సేవా ప్రయాణం ఆగదు. ప్రజలకు అవసరమైనప్పుడు సహాయం అందించడం మా ధ్యేయం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజి రెడ్డి, కార్య నిర్వహణ అధ్యక్షులు పటేల్ సత్తయ్య విశ్రాంతి పోలీసు ఉద్యోగులు మరియు ప్రస్తుత పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లాకు 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *