ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించరాదని హెచ్చరించారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ఈ చర్యలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
