జడ్చర్ల పోలీస్ స్టేషన్ కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు నగదు జరిమానా
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000/- రూపాయలు నగదు జరిమానా విధిస్తూ గౌరవనీయులైన రెండవ అదనపు జిల్లా మరియు సెషన్స్ (ఎస్.సి/ఎస్.టి) కోర్టు, మహబూబ్నగర్ వారు ఈరోజు తీర్పు వెలువరించారు.
ఈ కేసులో నిందితుడు పుంటికూర కరుణాకర్ రెడ్డి, తండ్రి శేఖర్ రెడ్డి, వృత్తి : వ్యవసాయం, కుచూర్ గ్రామం, నవాబ్పేట్ మండలం, మహబూబ్నగర్ జిల్లా.
ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు, పక్కా సాక్ష్యాల సేకరణ, సాక్షులను సమయానికి కోర్టు ముందు హాజరుపరచడంలో పోలీస్ శాఖ మరియు న్యాయశాఖ అధికారులు కీలక పాత్ర పోషించారు.
ఈ కేసులో
ఎ. రమేష్ బాబు, ఇన్స్పెక్టర్, జడ్చర్ల పి.ఎస్ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించి కేసును బలమైన స్థాయిలో ముందుకు తీసుకువెళ్లారు.
బి. కిషన్, ఎస్డీపీఓ, మహబూబ్నగర్ — ద్వితీయ దర్యాప్తు అధికారి గా కేసును సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు.
టి.మహేష్, ఎస్డీపీఓ, మహబూబ్నగర్ — తృతీయ దర్యాప్తు అధికారి గా కేసును కోర్టు దశ వరకు పర్యవేక్షించారు.
న్యాయ ప్రక్రియలో
జె.హెచ్.రాజేశ్వర్, ప్రత్యేక ప్రజా అభియోగ అధికారి (ఎస్.సి/ఎస్.టి) కోర్టు), సుదర్శన్ రెడ్డి, ప్రజా అభియోగ అధికారి, జిల్లా సెషన్స్ కోర్టు,
ఈ.కిరణ్ కుమార్ రెడ్డి, అదనపు ప్రజా అభియోగ అధికారి (ఇన్చార్జ్ ఎస్.సి/ఎస్.టి కోర్టు)
వారు కేసును సమర్థవంతంగా వాదించి న్యాయం జరిగేలా కీలకంగా వ్యవహరించారు.
కేసు దర్యాప్తు మరియు కోర్టు ప్రక్రియలో
పి. వెంకటేశ్వర్లు, ఎస్డీపీఓ, మహబూబ్నగర్ — కాలానుగుణంగా సూచనలు అందించి కేసు పురోగతిని పర్యవేక్షించారు.
బి. కమలాకర్, ఇన్స్పెక్టర్, జడ్చర్ల పి.ఎస్— సాక్షుల హాజరు మరియు కోర్టు వ్యవహారాలను సమన్వయం చేశారు.
కోర్టు లైజన్ మరియు విధుల నిర్వహణలో
సి. నర్సిములు, ఏఎస్సై,
ఎం. నర్సిములు, హోంగార్డ్, రాములు, హెడ్ కానిస్టేబుల్,
యాదయ్య, పోలీస్ కానిస్టేబుల్.
ఈ కేసులో నిదితుడికి శిక్ష పడడానికి కృషి చేసిన న్యాయశాఖ అధికారులు, పోలీస్ అధికారులందరినీ మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు మరియు బలహీన వర్గాలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టం అందరికీ సమానమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
