సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన హోమ్ గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమంలో, ఫింగర్ ప్రింట్ యూనిట్లో విధులు నిర్వహిస్తున్న అప్పగళ్ళ జగన్ విశేష సేవలను గుర్తిస్తూ సత్కరించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి, IPS, జగన్ గారికి ఆప్రిషియేషన్ సర్టిఫికెట్ అందజేశారు. డ్యూటీలో నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజల భద్రత పట్ల చూపుతున్న కట్టుబాటు నేపథ్యంలో ఈ సన్మానం లభించింది.
సైబరాబాద్ పోలీస్ వ్యవస్థలో ఫింగర్ ప్రింట్ యూనిట్ సేవలు క్రైమ్ డిటెక్షన్లో కీలకమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్లో పనిచేస్తూ తన విధుల్లో ప్రతిభ కనబరుస్తున్న జగన్ గారిని అధికారి వర్గం అభినందించింది.
