• స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ ల నిర్వహణ..
• అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నారియణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: డిఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు గాను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారి ఆదేశానుసారం ఈ రోజు నారాయణఖేడ్ సబ్ డివిజన్ పరిధిలో గల అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డిఎస్పీ అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఎన్నికలను ప్రభావిత చేసే ఎలాంటి అక్రమ మద్యం, డబ్బు సరఫరా కాకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అందుకు వాహనదారులు పోలీసులకు సహకరించవల్సిందిగా సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని, హిస్టరీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించచి, సత్ప్రవర్తన కోరుతూ.. ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలని, ప్రతి రోజు ఆయా గ్రామాలను సందర్శించి, అల్లర్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించడం జరిగింది

