Breaking News

జిల్లెళ్ల చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.

జిల్లెళ్ల చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.

గ్రామపంచాయతి ఎన్నికల సందర్భంగా తంగాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి ఈరోజు ఆకస్మిక తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు,ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు,వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *