Breaking News

క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని వివిధ విభాగాల ప‌నితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు-స‌జ్జ‌న‌ర్.

హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ ఐసీసీసీలోని క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని వివిధ విభాగాల ప‌నితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు. ట‌వ‌ర్ ఏ లోని అడ్మిన్, అకౌంట్స్, ఐటీ, కంట్రోల్ రూం త‌దిత‌ర విభాగాలకు వెళ్లిన ఆయ‌న సిబ్బంది ప‌నితీరును అడిగి తెలుసుకున్నారు. మెయిన్ పీసీఆర్‌లోని ఇంటిగ్రేటెడ్ పాట్రోలింగ్ మేనేజ్ మెంచ్ ను ప‌రిశీలించారు. పాట్రోలింగ్ వాహ‌నాల రియ‌ల్ టైం క‌ద‌లిక‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. డ‌య‌ల్ 100కు వ‌స్తోన్న కాల్స్, స్పందిస్తోన్న తీరు, రెస్పాన్స్ టైం, త‌దిత‌ర వివ‌రాల‌పై ఆరా తీశారు.
ఈ సంద‌ర్భంగా సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.విధి నిర్వ‌హ‌ణ‌లో నిబ‌ద్ద‌త‌, అంకిత‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణతో ప‌నిచేయాల‌ని సిబ్బందికి సూచించారు. అవ‌స‌రం మేర‌కే సిబ్బందిని వినియోగించుకోవాల‌ని మినిస్ట్రియ‌ల్ స్టాఫ్‌ను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక‌త ప‌రిజ్ఞానాన్ని విధి నిర్వ‌హ‌ణ‌లో వినియోగించుకుని స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌న్నారు. టెక్నాలజీకి అనుగుణంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ ప‌నిత‌నాన్ని మెరుగుప‌రుచుకోవాల‌న్నారు. అత్యుత్త‌మ ప‌నిత‌నం క‌న‌బ‌రిచిన సిబ్బందిని గుర్తిస్తామ‌ని, వారికి రివార్డులు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌తో ప‌నిచేయాల‌ని, విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *