Breaking News

మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్లోజింగ్ ప్రోగ్రామ్ ను జిల్లా పోలీస్ అధికారి సుదీర్ రామ్నాథ్ కేకన్, ఐపీఎస్ ప్రారంభించారు. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, వారి సేవా స్పూర్తి ప్రతి పోలీస్ సిబ్బందికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు. తరువాత విజేతలకు, పాల్గొన్న అందరికీ, మరియు టోర్నమెంట్ నిర్వాహకులకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తొర్రుర్ డీఎస్పీ కృష్ణ కిషోర్,మరిపెడ సీఐ రాజకుమార్ గౌడ్, ఎస్ఐలు వీరభద్ర రావు, పిల్లల రాజు, ప్రమోద్ కుమార్,సంతోష్,సిబ్బంది మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *