Breaking News

డోర్నకల్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు ఆహారపదార్ధాలు,వాటర్ అందించిన – జిల్లా ఎస్పీ.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపివేయడం జరిగింది. ఈ సందర్భంగా రైలులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ మార్గదర్శకత్వంలో మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సరవయ్య, డోర్నకల్ సీఐ చంద్రమౌళి మరియు సిబ్బంది, ఎస్ఐలు మరియు కానిస్టేబుళ్లు రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలులోని ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేశారు. రైలు ఆలస్యం అయినప్పటికీ, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసు సిబ్బంది సకాలంలో సహాయం అందించి మానవతా సేవను చాటారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “మహబూబాబాద్ పోలీస్ ఎప్పుడూ ప్రజలతో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా సహాయం అవసరమైతే ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు” అని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడం పోలీసుల ప్రధాన ధ్యేయమని, వర్షం వంటి విపత్తు సమయంలో ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *