
జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రడం రాజేష్ (S/o వీరన్న) గ్రూప్–2 మరియు గ్రూప్–3 పరీక్షల్లో విశేష ఫలితాలు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్, ఐపీఎస్ కార్యాలయంలో ఆయనను సన్మానించారు. రడం రాజేష్ మోదుగులగూడెం గ్రామం, కురవి మండలం వాసి. ఆయన 10వ తరగతిని ZPHS మోదుగులగూడెంలో, ఇంటర్మీడియేట్ను సమైక్య జూనియర్ కాలేజీలో, బి.టెక్ను వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (బొల్లికుంట, వరంగల్) లో పూర్తిచేశారు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా 2 సంవత్సరాలు విధులు నిర్వహించిన ఆయన, 2021 నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజేష్ గ్రూప్–2లో 342 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (టెక్స్టైల్స్ & హ్యాండ్లూస్ డిపార్ట్మెంట్) హోదాలో ఎంపిక కావడం, అలాగే గ్రూప్–3లో 253 ర్యాంక్ సాధించడం గర్వకారణం. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన కృషి, పట్టుదల, నిబద్ధతను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలు అందించాలని ఆకాంక్షించారు.
