
రామాయణ మహా కావ్యాన్ని లిఖించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, ఏ. ఓ శ్రీనివాస్, యస్బి డీఎస్పీ మల్లారెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు,ఆర్.ఐ సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

