
ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, పిర్యాది సమస్యలను ఓపికగా విని, సమస్య జాప్యానికి గల కారణాల గురించి సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఫోన్ ద్వారా మాట్లాడి. వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేసి, బాదితులకు అండగా నిలవాలని యస్.హెచ్.ఓ. లకు సూచనలు చేయడం జరిగింది. జిల్లా ప్రజలు తమ సమస్యలకు స్థానిక పోలీస్ స్టేషన్లో పరిష్కారం దొరకని సందర్భంలో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా, స్వచ్ఛందంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజల సమస్యలను చట్టపరంగా పరిష్కరించి, సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో “ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ అవుతుందని, ప్రతి సమస్య పరిష్కారంలో జిల్లా పోలీస్ శాఖ ముందుండి పనిచేస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
