
వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా వినాయకుడికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించరు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరిని సుఖ సంతోషాలు,శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రజలందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని,శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు,సి.ఐ లు,ఎస్.ఐ లు,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
