Breaking News

పాడ్ బ్యాండ్డ్ నిర్వాహకులకు సూచనలు – శిల్పవల్లి, IPS,డీసీపీ.

శిల్పవల్లి, IPS,డీసీపీ,సెంట్రల్ జోన్, అదనపు డీసీపీ ఆనంద్, మరియు జోనల్ ఇన్స్పెక్టర్లు,సెంట్రల్ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో, యూసఫ్ ఫంక్షన్ హాల్, నాంపల్లి వద్ద పాడ్ బ్యాండ్ ఓనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.పాడ్ బ్యాండ్డ్ ముసుగులో డీజేలు ఏర్పాటు చేయరాదని, ఉత్సవాల సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని, శబ్ద మోత పరిమితికి మించరాదని స్పష్టంగా హెచ్చరించారు. శబ్ద మోత నియమిత ప్రమాణాలకు మించి వినిపిస్తే, సంబంధిత యజమానులు మరియు నిర్వాహకులపై సబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అదనంగా, ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించకుండా, అన్ని కార్యక్రమాలు నిబంధనలు పాటిస్తూ నిర్వహించాల్సిందిగా పాడ్ బ్యాండ్డ్ నిర్వాహకులకు సూచనలు ఇవ్వడమైనది.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *