Breaking News

ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

రోడ్డు ప్రమాదాల నివారణకు మిషన్ త్రిబుల్ ఆర్ (రోడ్డు సేఫ్టీ,రోడ్డు రూల్స్,రోడ్డు రెస్పాన్సుబులిటీ) కార్యక్రమం ద్వారా నార్కట్ పల్లిలో మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా,రోడ్డు నియమాలు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అన్నారు. నార్కట్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి , కామినేని హాస్పిటల్, ఏపీ లింగోటం, గోపాలయపల్లి ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగు ప్రదేశాలు గుర్తించి సంబంధిత అధికారుల సమన్వయంతో జీబ్రా క్రాసింగ్, రంబుల్ స్టిక్స్,సెంట్రల్ లైటింగ్, కాన్వేజ్ సేఫ్టీ మిర్రర్ లాంటి తగు నియత్రణ చర్యలు తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా అతివేగం నడుపుట,హెల్మెట్, సీట్ బెల్ట్, మద్యం సేవించే వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని అన్నారు. వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం తగ్గించి నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ వాహనాలకు సంబంధించిన అన్ని సరైన పత్రాలు తమ వెంట ఉంచుకోవాలి అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కావలసిన తగు చూచనల పైన గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రమాదాల నివారణకు విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు ప్రమాదాలకు గల కారణాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదాల జరిగినప్పుడు తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సిఐ నాగరాజు,నార్కట్ పల్లి ఎస్సై క్రాంతి, డి.టి.ఆర్బి ఇంచార్జ్ రిటైర్డ్ సీఐ అంజయ్య, గ్రామ ప్రజలు విద్యార్ధులు ఆటో డ్రైవర్లు,లారీ డ్రైవర్లు ఇతరులు పాల్గొన్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *