
జిల్లా ఎస్పీ ఆకస్మికంగా ముస్తాబద్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని,పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని ఆదేశించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు రూపొందించిన https://policeportal.tspolice.gov.in/ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవలని సూచించారు. గణేష్ చవితి సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా డీ.జే లు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,డి.జే యజనులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని అవసరం అయితే బైండోవర్ చేయాలని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని,ప్రజలు కూడా వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతకుముందు గంబీరావుపేట,లింగన్నపేట గ్రామాల మధ్య వరద ప్రవాహం ఎక్కువ ఉండి రాకపోకలకు ఇబ్బంది తలెత్తగా స్థానిక ఎస్.ఐ రమాకాంత్ తో కలసి పరిశీలించి అటు వైపు ఎవరు పోకుండా ఇరువైపులా బారికేడ్లు, సూచిక బొడ్లు ఏర్పాటు చేయాలని,అవసరం మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్.ఐ గణేష్ ,సిబ్బంది ఉన్నారు.

