
నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత జిల్లా ప్రజల అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి iAS మాట్లాడడం జరిగింది. జిల్లాలో మత్తుమందుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజలను కోరారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ iPS మరియు సంబంధిత ఉన్నతాధికార కిందిస్థాయి సిబ్బందితో నిర్వహించిన జిల్లా స్థాయి మత్తుమందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత మత్తుమందులకు బానిస కాకుండా అన్ని స్థాయిలలో అవగాహన కల్పించాలని,నల్గొండ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా చేసేందుకు పాఠశాల,కళాశాల విద్యార్థులు,యువత అందరిలో అవగాహన కల్పించాలని అన్నారు.
