Breaking News

సంగారెడ్డి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ips.

•డిటిసి పరిసరాలు, బ్యారేక్స్ పరిశుభ్రంగా ఉండాలి.
•రిఫ్రెష్మెంట్ కోర్స్ లో భాగంగా సిబ్బందికి శిక్షణను ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి.
సంగారెడ్డి జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సందర్శించి, డిటిసి పరిసరాల శుభ్రత, బ్యారేక్స్, క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ పరిశుభ్రతను ఎస్పీ తనిఖీ చేశారు. డి.టి.సి. ప్రిన్సిపాల్, డ్రిల్, లా- క్లాస్ ఇన్స్ట్రక్టర్స్ తో మాట్లాడుతూ డిటిసి పరిసరాలు, లా క్లాస్ రూమ్స్ పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. రిఫ్రెష్మెంట్ కోర్స్ లో భాగంగా శిక్షణకు వచ్చే జిల్లా సిబ్బందికి నాణ్యమైన శిక్షణను అందించే విధంగా ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, డ్రిల్ ఇన్స్ట్రక్టర్ లు రెగ్యులర్ పరేడ్, డ్రిల్స్ ప్రాక్టీస్ లో ఉండాలని అన్నారు. ఫిజికల్ ట్రైనింగ్, లా క్లాస్ లను సమర్ధవంతంగా నిర్వహిస్తూ సిబ్బందికి నాణ్యతతో కూడిన శిక్షణను అందించాలని ఎస్పీ సూచించారు. ఈ విజిటింగ్ లో ఎస్పీ వెంబడి డి.టి.సి. ప్రిన్సిపాల్ అదనపు ఎస్పీ. శ్రీనివాస రావ్, వైస్.ప్రిన్సిపాల్, డియస్పి. సురేందర్ రెడ్డి, చీఫ్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆర్.ఐ. శ్రీనివాస్, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్. ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *