Breaking News

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

• జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన జిల్లా ఎస్పీ.
• ఫిర్యాది సమస్యలను విని, వారి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయవలసిందిగా యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విని, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత యస్.హెచ్.ఓ. లకు ఫోన్ ద్వారా మాట్లాడి, వారి సమస్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడం ఎలాంటి అలసత్వం చూపరాదని, చట్టప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ. లకు సూచనలు చేయడం జరిగింది. జిల్లా ప్రజలు తమ సమస్యకు పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా జిల్లా ఎస్పీ  సూచించారు.

గ్రీవెన్స్ డే లో పలు ఫిర్యాదులను పరిశీలించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *