Breaking News

స్వాతంత్ర దినోత్సవ మరియు వినాయక చవితి సందర్భంగా ముందస్తు బద్రత తనిఖీలు.

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్, ఆదేశాల మేరకు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం మరియు వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. క్లాక్ టవర్, పుట్నాల బట్టి, రామ్ మందిర్, పాన్ చౌరస్తా, తూర్పు కమాన్ మరియు ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో గల హోటళ్లు, టీ స్టాళ్లు, పాన్ షాపులలో స్పెషల్ పార్టీ బృందాలు మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, ప్రజలు భద్రతా నియమాలను పాటించి శాంతి భద్రతలకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు బైకులపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ర్యాలీ చేసిన చట్టరీత్య చర్యలు తీసుబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్యతో పాటు ఎస్సైలు సీనయ్య, రషీద్, సిబ్బంది, స్పెషల్ పార్టీ సభ్యులు మరియు రుద్ర డాగ్ హాజరయ్యారు.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *