Breaking News

జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి – జిల్లా ఎస్పీ.

జిల్లాలో చింతపల్లి,దేవరకొండ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న రాజారాం నాయక్,రవి నాయక్ లకు కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడుతూ పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. పోలీసు స్టేషనుకు వచ్చే పిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడుతూ సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తూ తమకు అప్పగించిన విధులను క్రమ శిక్షణతో బాధ్యతతో పని చేయాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సంఘం అధ్యక్షుడు జయ రాజు  తదితరున్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *