Breaking News

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నా-సి.వి. ఆనంద్ ఐపీఎస్.

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ జరుగుతున్న సందర్బంగా హైదరాబాద్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, సి.వి. ఆనంద్ ఐపీఎస్ మరియు అధికారులతో కలసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత ఆలయాన్ని సందర్శించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు క్యూ లైన్లు, రూట్ మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా సి.వి. ఆనంద్ కమిషనర్ మాట్లాడుతూ, బోనాల ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. చైన్ స్నాచర్లు, పిక్ పాకెటర్లు మరియు ఈవ్ టీజర్లను అదుపులో ఉంచడానికి సీసీటీవీ కెమెరాలు, క్రైమ్ బృందాలు మరియు షీ టీమ్ బృందాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనలో సి.వి. ఆనంద్ కమిషనర్ తో పాటు డి. జోయల్ డెవీస్ ఐపీఎస్ (జాయింట్ సీపీ ట్రాఫిక్), శ్రీమతి ఎస్. రష్మి పెరుమాల్ ఐపీఎస్ (డిసిపి నార్త్ జోన్), శ్రీమతి కె. అపూర్వారావు ఐపీఎస్ (డిసిపి స్పెషల్ బ్రాంచ్), శ్రీమతి శ్వేత ఐపీఎస్ (డిసిపి డిడి), రాహుల్ హెడ్గే ఐపీఎస్ (డిసిపి ట్రాఫిక్), శ్రీమతి రక్షితి కృష్ణ మూర్తి ఐపీఎస్ (డిసిపి హెడ్ క్వార్టర్స్), శ్రీమతి శిల్పా వళి ఐపీఎస్ (డిసిపి సెంట్రల్ జోన్), బి. బాలస్వామి ఐపీఎస్ (డిసిపి ఈస్ట్ జోన్), ఎస్. చైతన్య కుమార్ (డిసిపి సౌత్ ఈస్ట్ జోన్), వైవిఎస్. సుధీంద్ర (డిసిపి టాస్క్ ఫోర్స్) మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా సైబర్ మోసాలపై హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *