
ఈ మధ్య కాలంలో PM _KISAN యోజన మరియు SBI Rewards వంటి నకిలీ మొబైల్ అప్లికేషన్లను Whatsapp, Telegram మరియు సోషల్ మీడియా ద్వారా పంపే లింకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటిని క్లిక్ చేసి మోసపోవద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మధ్య కాలంలో కొంత మంది సైబర్ నేరగాళ్లు PM కిసాన్, SBI రివార్డ్ అనే apk పైల్స్ what’s up, telegram మరియు సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. పొరపాటున ఇలాంటి లింక్స్ క్లిక్ చేసి అప్లికేషన్ Install చేశారంటే మీ ఫోన్ హ్యాక్ అయి వినియోగదారుడి ఫోన్ లో గల OTPలు, బ్యాంక్ వివరాలు మరియు వ్యక్తిగత వివరాలు చోరీ వారి అధీనంలోకి వెళ్తాయి అన్నారు. ఆపై బాధితుడి Whatsapp ఖాతాను హైజాక్ చేసి, అదే నకిలీ లింక్ ను అతని ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లకు ఆటోమేటిక్ గా పంపిస్తుందనీ,ఈ మోసాలకు సంబందించి ఇప్పటికే పలు కంప్లైంట్స్ నమోదయ్యాయి అన్నారు. ఈ మోసాల ద్వారా బాధితులు ఆర్ధిక నష్టాలు,అక్రమ లావాదేవీలు డేటా గోప్యతా ఉల్లంఘనలను ఎదుర్కొన్నారు. ఇలాంటి నకిలీ APK ఫైల్స్ మోసాల బారిన పడకుండ ఉండాలంటే ప్రజలు Whatsapp లో అనుమానస్పద లింక్ లను క్లిక్ చేయరాదని, ఇలాంటి PM _KISAN యోజన లేదా SBI Rewards పేరుతో APK లింక్స్ వచ్చినప్పుడు వాటిని వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. మీ వ్యక్తిగత సమాచారం,బ్యాంక్ వివరాలు లేదా ఓటిపిలు ఎవరితోనూ షేర్ చేయకుండా ఉండాలని తెలిపారు. ఈలాంటి సమాచారం ప్రభుత్వ సంస్థలు అడగవు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు లేదా 1930 టోల్ ఫ్రీ నంబరు కు కాల్ చేసి రిపోర్ట్ చేయగలరని సూచించారు.
