నల్గొండ పట్టణంలో ఆవారాగా తిరుగుతూ చెడు వ్యాసనాలకి అలవాలు పడి, జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను నల్గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ముఠా వివరాలు (నిందితులు):
A1: నదీమ్ తండ్రి ఇబ్రహీం, వయస్సు 25 సం. లు, కులం ముస్లిం, నివాసం: పంజేష, నల్గొండ పట్టణం
A2: షేక్ రిజ్వాన్ తండ్రి సలీం, వయస్సు: 26 సం,, కులం: ముస్లిం, వృత్తి: ప్రైవేట్ ఎంప్లాయ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, నివాసం ఇంటి నెం 3-9-91, ఘడి మస్జిద్, నల్గొండ పట్టణం
A3: మహమ్మద్ అబ్దుల్ సమీర్ తండ్రి షకీల్, వయస్సు 23 సం,, కులం: ముస్లిం, వృత్తి: ఎలెక్ట్రికల్ వర్క్, నివాసం జామా మస్జిద్, నల్గొండ పట్టణం ప్రస్తుత నివాసం హౌసింగ్ బోర్డు కాలనీ, నల్గొండ పట్టణం
(ముగ్గురు గతం లో నేరాలు చేసి, జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది)
రికవరీ చేసిన సొత్తు:
1) 30 తులాల వెండి ఆభరణాలు
2) 4 గ్యాస్ సిలిండర్లు
3) 3 బ్యాటరీలు
4) 4 సెల్ ఫోన్లు
5) ₹14,500 నగదు
కేసు పూర్వాపరాలు:
నల్గొండ పట్టణం లో ఓల్డ్ సిటీ ఏరియా లో ని వివిద కాలనిలకి చెందిన నిందితులు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, ముఠా గా ఏర్పడి, నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో తాళం వేసిన ఇళ్ళని లక్ష్యంగా చేసుకుని , నల్గొండ పాతబస్తీ ఏరియాలో ఇళ్ల తాళాలు పగలగొట్టి గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతోంది. నమ్మదగిన సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, మొత్తం (05) దొంగతనం నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపారు.
నల్గొండ డీఎస్పీ శ్రీ కె శివరాం రెడ్డి గారి ఆదేశానుసారం, చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, వెంకట్ నారాయణలతో పాటు సిబ్బంది రబ్బానీ, సాగర్ల శంకర్, అంజద్,కిరణ్, అంజయ్యలను జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS గారు అభినందించారు.
