గణేష్ ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
మహబూబాబాద్: పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, గణేష్ ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై సమీక్షించారు.
పోలీస్ స్టేషన్లలో సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష్య, ఈ-సమ్మన్స్ తదితర సాంకేతిక వ్యవస్థల వినియోగం, కేసులకు సంబంధించిన వివరాల నమోదు, పెండింగ్ ప్రక్రియలు, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. పోలీసింగ్లో అందుబాటులో ఉన్న సాంకేతిక వ్యవస్థలను కేవలం వివరాల నమోదు కోసమే కాకుండా దర్యాప్తు ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు.
సీసీటీఎన్ఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రతి దశకు సంబంధించిన వివరాలను సకాలంలో, కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఎంట్రీలను ఎప్ప
